కొండా సురేఖకు కేటీఆర్ అభినందనలు

చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖ గారికి చాలా అభినందనలు అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు.

By Medi Samrat
Published on : 16 May 2025 3:15 PM IST

కొండా సురేఖకు కేటీఆర్ అభినందనలు

చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖ గారికి చాలా అభినందనలు అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ "కమిషన్ సర్కార్" నడుపుతోంది, ఇది తెలంగాణలో బహిరంగ రహస్యంగా మారడం దురదృష్టకరమన్నారు. ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని తాను కొండా సురేఖ గారిని కోరుతున్నానన్నారు కేటీఆర్. ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ తమ సొంత క్యాబినెట్ మంత్రితో విచారణకు ఆదేశించగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమీషన్ సర్కార్ నడుస్తోందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యమేనన్నారు. ఈ ప్రభుత్వంలో ఫైళ్లపై సంతకాలు పెట్టాలంటే మంత్రులు, వారి సహచర మంత్రులు ఏకంగా 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణలో కొందరు మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని మాట్లాడినట్లు జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొంత మంది పూర్తిగా వక్రీకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పని తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.

Next Story