ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాజాగా వరంగల్లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. 'గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది.. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నా పోటీ ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా నాకు ఎవరి పైసా అవసరం లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.
అలాగే, నేను ఎవరికీ భయపడను. సురేఖను ఐదు సార్లు నా ప్రాభల్యంతోనే గెలిపించుకున్నా. డీసీసీబీ బ్యాంకు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు బాధ్యతలు అప్పగించారు. రాజశేఖర్ రెడ్డి నామీద నమ్మకంతో రూ.13 కోట్లు అప్పగించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను నామినేషన్ వేస్తే ఏ పార్టీ నుంచి కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. నేను ఒక రౌడీని అయినా నా మీద ప్రజల ప్రేమ ఉంది. నా మంచితనమే నా రాజకీయ ఎదుగుదలకు కారణం. మరోసారి బరిలో నిలవబోతున్నా మీ అందరి ఆదరణ ఉండాలి... అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొండా మురళి హాట్ కామెంట్స్...నేను 500 ఎకరాల వత్దందారుడిని...మొన్న ఎన్నికల్లో డెబ్బై కొట్లు ఖర్చు పెట్టిన...ఇప్పటికే కొన్ని ఎకరాలు అమ్ముకున్ననాకు ఎవరి పైసలు అవసరం లేదు...నేను ఎవరికి బయపడను.నా రాజకీయ పొరు అంతా ఉన్నత వర్గాలతోనే...నా మనస్తత్వం దేశం మొత్తానికి తెలుసు.… pic.twitter.com/fsWJH6fcWO
— Radha Parvathareddy (@radhachinnulu) June 30, 2025