ఖమ్మంలో అధికార బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ముక్తార్ దంపతులు బీఆర్ఎస్ ను వీడారు. కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ముక్తార్ సుడా డైరెక్టర్ గా, నగర మైనారిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరే కాకుండా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పుడున్న వాళ్లంతా అప్పుడు టీఆర్ఎస్ నుండే గెలిచారని.. నేను ఈరోజుకు ఒక్కసారి కూడా మేయర్ కి ఫోన్ చేయలేదని.. అసభ్య భాషను వాడలేదన్నారు. మర్డర్ కేసులో కూడా ఇంత చెయ్యరని.. వాళ్లపై పీడీ యాక్ట్ కేసులు, నిర్భందాలు చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దారుణాలను తట్టుకోలేక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని అన్నారు. డిప్యూటీ మేయర్ చాలా మంచి పని చేశారని.. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నామన్నారు తుమ్మల.