కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు: లక్ష్మణ్

కేసీఆర్, సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

By Knakam Karthik  Published on  24 Feb 2025 1:51 PM IST
Telangana, CM Revanth, Bjp Laxman, Brs, Kcr

కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు: లక్ష్మణ్

కేసీఆర్, సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిపిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంపై రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టారని.. ప్రస్తుతం సీఎం అనుభవం లేక రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో పడేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్లి సాధించుకోవాల్సిన దారుణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదని, బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఐదేళ్లకు ఓసారి పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా.. దానిని పట్టించుకోవడం లేదని, ఐదు డీఏలను పెండింగ్ లో పెట్టిందని తెలియజేశారు.

Next Story