కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై కేసీఆర్ అనూహ్య నిర్ణయం
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై కేసీఆర్ అనూహ్య నిర్ణయం
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఈ నెల 5వ తేదీన హాజరుకావాల్సి ఉండగా..దానికి బదులుగా ఈ నెల 11న హాజరవుతానని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
కాగా కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు , ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటల రాజేందర్లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరుకానున్నారు.