వైభ‌వంగా కేసీఆర్ ద‌త్త‌పుత్రిక వివాహం

KCR adopted daughter Marriage. తెలంగాణ సీఎం కేసీఆర్ దత్త‌పుత్రిక ప్ర‌త్యూష వివాహాం చ‌ర‌ణ్‌రెడ్డితో వైభ‌వంగా జ‌రుగుతోంది.

By Medi Samrat  Published on  28 Dec 2020 7:33 AM GMT
వైభ‌వంగా కేసీఆర్ ద‌త్త‌పుత్రిక వివాహం

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్త‌పుత్రిక ప్ర‌త్యూష వివాహాం చ‌ర‌ణ్‌రెడ్డితో వైభ‌వంగా జ‌రుగుతోంది. రంగారెడ్డి జిల్లా పాటిగ‌డ్డ చ‌ర్చిలో క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. వీరి వివాహానికి స్థానిక ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించారు. పెళ్ళి ఏర్పాట్లును స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది.

కాగా.. ఆదివారం మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ సభ్యులు ప్రత్యూషను పెళ్లి కుమార్తెను చేశారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సైతం పాల్గొని నవవధువుకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు.

ప్రత్యూషను కేసీఆర్‌ దత్తత తీసుకునేందుకు కారణాలను పరిశీలిస్తే..

హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన ప్రత్యూష.. తన తల్లి 2003లో చనిపోయేముందు తన పేర ఉన్న ఆస్తిని ప్రత్యూషకు రాసింది. తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరిపోవడంతో.. ఆ తర్వాత తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతితల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. భౌతికదాడులకు సైతం పాల్పడింది. తండ్రి కూడా సవతి తల్లికే వత్తాసు పలికి హింసించాడు. విషయం తెలుసుకున్న అధికారులు.. మరణం అంచున ఉన్న ప్రత్యూషను సవతితల్లి, తండ్రి చెరనుంచి విముక్తి కల్పించి వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌.. ప్రత్యూషను దత్తత తీసుకొన్నారు. ఆమె కోరిక మేరకు నర్సింగ్‌ కోర్సును పూర్తి చేయించారు. ప్రస్తుతం ప్రత్యూష ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడింది. ఆమె కోరిక మేరకు ఇవాళ రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో వివాహం జరిపించారు.


Next Story