కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల చెల్లింపులకు సంబంధించి ఆర్టీఐ (RTI) ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన ఆరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల్లో మొత్తం రూ.72,766 కోట్లు తిరిగి చెల్లించారు. ఇందులో విశేషం ఏమిటంటే, గత ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అత్యధికంగా రుణాలను చెల్లిస్తోంది.
ముఖ్యంగా 2025 ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో రూ.33,574 కోట్లు చెల్లించారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువ. ఇక 2026లో కేవలం ఒకే ఒక్క నెలలో వడ్డీ రూపంలోనే రూ.417 కోట్లు చెల్లించడం గమనార్హం. ప్రాజెక్టు అప్పుల భారం రాష్ట్ర ఖజానాపై ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.