తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధుల చెల్లింపుపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను వరి నాట్లు పడకముందే రైతుల ఖాతాల్లో అందరికీ ఒకేసారి జమ చేస్తామని కీలక ప్రకటన చేశారు.
ఇక, రైతు భరోసా కింద ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి రూ. 12 వేలు రైతుల అకౌంట్లలలో జమ చేయనుంది. రెండు విడతల్లో రూ. 6 వేల చొప్పున ఈ మొత్తాన్ని విడుదల చేస్తుంది. అయితే గత యాసంగి పంట సమయంలో కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడదలయ్యాయి. మిగిలిన రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.