కేసీఆర్ దళితులకు చెప్పింది ఏది జరగలేదు : గీతారెడ్డి

Geetha Reddy Fires On CM KCR. దళితబంధు పేరుపెట్టి కేసీఆర్ దళితుల్ని దాకా చేస్తున్నారని.. అది దళిత బంధునా? దళిత దఘానా?

By Medi Samrat  Published on  31 July 2021 7:54 AM GMT
కేసీఆర్ దళితులకు చెప్పింది ఏది జరగలేదు : గీతారెడ్డి

దళితబంధు పేరుపెట్టి కేసీఆర్ దళితుల్ని దాకా చేస్తున్నారని.. అది దళిత బంధునా? దళిత దఘానా? అని ప్ర‌శ్నించారు మాజీమంత్రి, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి. కేసీఆర్ దళితులకు చెప్పింది ఏది జరగలేదని అన్నారు. దళిత సీఎం అని మాట తప్పారు.. రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి బర్తరఫ్ ఎందుకు చేశారో చెప్పలేదని ఫైర్ అయ్యారు.

ఎస్సీ- ఎస్టీ సబ్ ప్లాన్ మారుస్తా అని మార్చలేదు. ఏడేళ్లుగా 85వేల కోట్లు కేటాయించి.. 47వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.. 38 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ పోయాయో ఎవ్వరికీ తెలీదని అన్నారు. దళితులకు బడ్జెట్ లో కేటాయించిన నిధులే పూర్తిగా ఖర్చు చేయని కేసీఆర్.. లక్షల కోట్లు పెడుతా అంటే ఎలా నమ్మాలి? అని ప్ర‌శ్నించారు. 5లక్షల 33వేల దరఖాస్తులు వస్తే లక్ష దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోలేద‌ని అన్నారు. ఎస్సీలకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం తెచ్చిన జీవోలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని మండిప‌డ్డారు.

దళితులకు భూపంపిణీ ప్రతిష్టాత్మక పథకం అన్నారు.. మూడెకరాల భూమి లబ్ధి కోసం 3 లక్షల కుటుంబాలు ఉంటే.. 6,662 కుటుంబాలకు 16వేల ఎకరాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. దళితులతో వివాహం జరిగితే మృత్యువాత పడుతున్న పరిస్థితి నెలకొందని ఆవేద‌న వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో కనీస స్టాప్ లేకుండా విద్యార్థులు తీవ్ర‌మైన ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్ కు పూలమాల వేశారా? అని ప్ర‌శ్నించారు.

దళితబంధు పథకం అమలుకు మాకు అభ్యంతరం లేదని.. కానీ రాష్ట్రం అంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోసమే హుజురాబాద్ లో దళితబంధు ఫైలెట్ ప్రాజెక్టు అమలు అని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని ఆమె అన్నారు. హుజురాబాద్ లో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వెయ్యకపోతే.. దళితబంధు రాష్ట్రం అంతటా అమలు చేయమని దళితుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు.


Next Story