గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ : సీఎం రేవంత్ రెడ్డి

గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

By Medi Samrat  Published on  29 Aug 2024 1:45 PM GMT
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ : సీఎం రేవంత్ రెడ్డి

గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించేందుకే ఈ సమావేశం నిర్వహించామ‌ని తెలిపారు. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు.

చిత్తశుద్ధి, నిబద్దత‌తో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించండని సూచించారు. నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరం అన్నారు. ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతీ ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలని సూచించారు. వీవీఐపీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైందన్నారు. సెప్టెంబర్ 17న జరిగే రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరం అన్నారు.

Next Story