Video: చేతిలో ఫైల్‌తో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

By Knakam Karthik
Published on : 11 Jun 2025 11:31 AM IST

Telangana, Kaleshwaram Commission, Justice P Chandraghosh, Kcr, Congress Government

Video: చేతిలో ఫైల్‌తో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్

కాళేశ్వరం బ్యారేజీ అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చివరి దశకు చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ విచారణ చేస్తుంది. ఈ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్ విచారణ చేస్తోంది. బ్యారేజీల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల ఇంజినీర్లను ఇప్పటికే కమిషన్​ విచారించింది. ఏఈఈలు మొదలుకొని ఈఎన్సీ వరకు కమిషన్​ విచారించింది. వారి సాక్ష్యాలను కమిషన్​ నమోదు చేసింది.

విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు, ఆర్థికపర అంశాలపై మాజీ మంత్రులు ఈటల రాజేందర్​, హరీశ్‌రావును కమిషన్​ ప్రశ్నించింది. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌​ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నిస్తోంది. అయితే అంతకుముందు ఆయన ఈనెల 5నే హాజరుకావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగటంతో విచారణను నేటికి వాయిదా వేశారు. ఇవాళ కేసీఆర్​ విచారణకు హాజరుకావడంతో కమిషన్​ ఆయనను ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు కమిషన్​ 114 మందిని విచారణ చేసింది.

Next Story