కాళేశ్వరం బ్యారేజీ అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చివరి దశకు చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ విచారణ చేస్తుంది. ఈ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను కమిషన్ విచారణ చేస్తోంది. బ్యారేజీల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల ఇంజినీర్లను ఇప్పటికే కమిషన్ విచారించింది. ఏఈఈలు మొదలుకొని ఈఎన్సీ వరకు కమిషన్ విచారించింది. వారి సాక్ష్యాలను కమిషన్ నమోదు చేసింది.
విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు, ఆర్థికపర అంశాలపై మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావును కమిషన్ ప్రశ్నించింది. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నిస్తోంది. అయితే అంతకుముందు ఆయన ఈనెల 5నే హాజరుకావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగటంతో విచారణను నేటికి వాయిదా వేశారు. ఇవాళ కేసీఆర్ విచారణకు హాజరుకావడంతో కమిషన్ ఆయనను ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు కమిషన్ 114 మందిని విచారణ చేసింది.