సీఎం రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించేనా.?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. అయితే ఆయన వచ్చినప్పుడు అవసరమైన ప్రోటోకాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాటిస్తారని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  2 March 2024 12:00 PM GMT
సీఎం రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించేనా.?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. అయితే ఆయన వచ్చినప్పుడు అవసరమైన ప్రోటోకాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాటిస్తారని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మార్చి 4-5 తేదీల్లో రాష్ట్రాన్ని సందర్శించి, రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ బహిరంగ సభలలలో పాల్గొననున్నారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

మార్చి 2, శనివారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రముఖులకు ఆహ్వానాలు పంపామని, సంప్రదాయం ప్రకారం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారని భావిస్తున్నానన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ సంప్రదాయాన్ని పాటించలేదని.. రేవంత్‌రెడ్డి ప్రోటోకాల్‌ను అనుసరించి ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

ప్రధాని మోదీ పర్యటన:

మార్చి 4న ఆదిలాబాద్‌లో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మార్చి 5న సంగారెడ్డిలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్త వాటికి శంకుస్థాపనలు, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Next Story