కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు
ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనునట్లు ఆయన ప్రకటించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 3 నాడు స్థానిక అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి చీఫ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళ కాంగ్రెస్ విభాగంతో పాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొనాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని శ్రేణులకు సూచించారు.