రూ. 1500 కోట్ల విలువైన భూముల‌ను ఆ ఎంపీకి అప్పనంగా ఇచ్చేశారు

Dasoju Sravan Fires On CM KCR. రూ.1500 కోట్ల రూపాయల విలువైన ఫిల్మ్ నగర్ భూములను ఎంపీ రంజిత్ రెడ్డికి అడ్డగోలుగా

By Medi Samrat  Published on  8 Sep 2021 1:25 PM GMT
రూ. 1500 కోట్ల విలువైన భూముల‌ను ఆ ఎంపీకి అప్పనంగా ఇచ్చేశారు

రూ.1500 కోట్ల రూపాయల విలువైన ఫిల్మ్ నగర్ భూములను ఎంపీ రంజిత్ రెడ్డికి అడ్డగోలుగా ఇచ్చేశార‌ని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావ‌ణ్ ఆరోపించారు. కంచె చేను మేసినట్టుగా అధికార పార్టీ నాయకులు విలువైన భూములు అడ్డగోలుగా తీసుకున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డిలకు ప్రభుత్వం విలువైన భూములను కట్టబెట్టిందని.. 17 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారని మండిప‌డ్డారు. తెలంగాణ కు వ్యతిరేకంగా ఉన్నాడని బద్నాం చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భూములను కాపాడారని.. కేసీఆర్ తెలంగాణ భూములను దోపిడిదార్లకు అప్పగించారని.. ఇందులో కేసీఆర్ వాటా ఎంత? అని ప్ర‌శ్నించారు.

ఆంజనేయ స్వామి దేవాల‌యాన్ని కూడా తొలగించి భూములను స్వాధీనం చేసుకున్నారని.. ఇక్కడి ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నియోజక వర్గంలో ఉన్న ఈ భూముల గురించి మాట్లాడుతారా.. అని ప్ర‌శ్నించారు. గతంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పని చేశార‌ని.. బీజేపీ వాళ్ళు ఆంజనేయ గుడిని ఎందుకు కాపాడేందుకు పోరాటం చేయడం లేదని ప్ర‌శ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాసామని.. సంబంధిత అధికారులకు, హౌసింగ్ బోర్డ్ కు లేఖలు రాసామని తెలిపారు. ఈ విషయంలో ఎంత దూరం అయిన వెళ్తామ‌ని.. తెలంగాణ భూములు కాపాడుకుంటామ‌న్నారు దాసోజు శ్రావ‌న్‌.


Next Story