అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేశారు. అనంత‌రం గన్ పార్క్ వద్ద ఆయ‌న మాట్లాడుతూ.. అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు అన్నారు

By Medi Samrat  Published on  26 April 2024 8:06 AM GMT
అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేశారు. అనంత‌రం గన్ పార్క్ వద్ద ఆయ‌న మాట్లాడుతూ.. అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు అన్నారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు.. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైల పడిందని.. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగిందని వెల్ల‌డించారు. 10 ఏళ్లుగా హరీష్ రావు కి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదని దుయ్య‌బ‌ట్టారు.

హరీష్ రావు బీఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమేన‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారని అన్నారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారని.. హరీష్ రావు రాజీనామా లేఖ‌ను వృధా కానివ్వను.. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు.

శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన నువ్వు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా అని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు అడుతున్నావని మండిప‌డ్డారు. ఆగస్ట్ 15 వ తేదీ లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో లేదో కేసీఆర్ గారిని చెప్పామనండని అడిగారు. హరీష్ రావు ఆగస్ట్ 15 తర్వాత మీ రాజీనామా ఆమోదం చెందేలా ఎమ్మెల్సీ గా నేను బాధ్యత తీసుకుంటాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలా వచ్చి వెళ్ళడం కాదు. పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి రండి ఎమ్మెల్సీ గా నేను మీకు సవాల్ విసురుతున్నానన్నారు.

Next Story