కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు

బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైద‌రాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

By Medi Samrat
Published on : 12 Jun 2025 3:08 PM IST

కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు

బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైద‌రాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో​ పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కేటీఆర్‌ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని ఆరోపించారు బల్మూరి వెంకట్.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని మీడియాకు తెలిపారు వెంకట్. కింది స్థాయిలో ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొనేలా చూస్తున్నారన్నారు. చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని కూడా అన్నారు.

Next Story