తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బనకచర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

By Knakam Karthik
Published on : 2 July 2025 3:57 PM IST

Telangana, Congress Mla Anirudh Reddy, Andhra Pradesh, Banakacherla, Chandrababu, Congress govt

తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నార‌ని పేర్కొన్నారు. బుధవారం బాలాన‌గ‌ర్ మండ‌లం మోతి ఘ‌న‌పురంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం అనిరుధ్ రెడ్డి మాట్లాడారు

ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు ఉత్త‌మ్ అన్న‌.. తెలంగాణలో చంద్రబాబుకు కోవర్థులు ఉన్నారని.. చంద్రబాబు నాయుడు కట్టే బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటే, కోవర్టుల‌కు నీటి కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్లు కట్ చేయాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఆపాలి. అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్‌గా బంద్ అవుతుంది..అని జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Next Story