వారే కుట్ర పన్ని నన్ను ఓడించారు: పొదెం వీరయ్య

సీపీఐ నాయకులు చివరి నిమిషంలో పార్టీ మారి తనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే నేను స్వల్ప మెజార్టీతో ఓడి పోయానని

By Medi Samrat  Published on  6 Dec 2023 8:52 AM GMT
వారే కుట్ర పన్ని నన్ను ఓడించారు: పొదెం వీరయ్య

సీపీఐ నాయకులు చివరి నిమిషంలో పార్టీ మారి తనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే నేను స్వల్ప మెజార్టీతో ఓడి పోయానని మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నేను గెలుస్తానని సర్వేలు వచ్చాయి.. ప్రజల నుంచీ అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఇలా పాజిటివ్ గా వున్న టైమ్ లో ఎన్నికలకు నాలుగు రోజులు ముందు సీపీఐ పార్టీ నేతలు మెయిన్ క్యాడర్ ను అంతా తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సీపీఐ నేతల నమ్మక ద్రోహం వల్లే ఓడిపోయానని అన్నారు.

పువ్వాడ అజయ్ బంధుత్వంతో ఈ సీపీఐ లీడర్లు అంతా కుమ్మక్కై భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో దొంగ దెబ్బ తీశారని పేర్కొన్నారు. నేను గెలిస్తే ఉప ముఖ్య మంత్రి పదవి, మంత్రి పదవి వస్తుందని భావించి స్వార్ద రాజకీయాలతో కుట్ర పన్ని నన్ను ఓడించారని ఆరోపించారు. గత 36 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నా..బీఆర్ ఎస్ పార్టీ కోట్ల రూపాయలు ఆశ చూపినా నేను పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో వెన్ను దన్నుగా వున్నానని.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం నన్ను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.

Next Story