యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణలో యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By Knakam Karthik
Published on : 14 Feb 2025 2:30 PM IST

Telangana, CM RevanthReddy, Congress Government, Residential Schools

యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణలో యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వంద నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపులు పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్టు అందించాలని ఆదేశించారు.

ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వంద శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.

Next Story