పని చేస్తేనే పదవులు, జూబ్లీహిల్స్ బైపోల్‌కు పార్టీని సిద్ధం చేయాలి: సీఎం రేవంత్

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik
Published on : 24 Jun 2025 2:57 PM IST

Telangana, Cm Revanthreddy, Congress Government, Tpcc

పని చేస్తేనే పదవులు, జూబ్లీహిల్స్ బైపోల్‌కు పార్టీని సిద్ధం చేయాలి: సీఎం రేవంత్

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వ సమన్వయంతో ముందుకు వెళతాం. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పని చేయాలి. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతాం. పార్టీ నిర్మాణంపై పీసీసీ ఫోకస్ పెట్టాలి. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి..అని సీఎం పేర్కొన్నారు.

పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్‌లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్ట కాలంలో పని చేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలి. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమ శిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి..అని సీఎం వ్యాఖ్యానించారు.

Next Story