అసదుద్దీన్‌ ఓవైసీ పేదల గొంతుక.. ప్రశంసించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

By అంజి
Published on : 15 Sept 2024 7:28 AM IST

CM Revanth Reddy, Asaduddin Owaisi, Parliament, Hyderabad, Telangana

అసదుద్దీన్‌ ఓవైసీ పేదల గొంతుక.. ప్రశంసించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రశంసించారు. పార్లమెంట్‌లో పేదల కోసం నిరంతరం మాట్లాడే రాష్ట్రానికి చెందిన ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రవక్త ఫర్ ద వరల్డ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌ మాట్లాడుతూ, “అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఎంపీ చేసిన అవిశ్రాంత కృషి”ని ప్రశంసించారు. ఆయనను “పేదల వాయిస్” అని పిలిచారు.

''కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా మా సొంత అన్న (హైదరాబాద్‌కు చెందిన) స్వరం పెంచడం నాకు నచ్చింది. ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే మనకు శత్రువు కాలేడు. ప్రభుత్వాన్ని నడపడంలో కొన్ని తప్పులు ఉండవచ్చు. తప్పులు సరిదిద్దుకోవడానికి.. ఆ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా మనకు బలమైన ప్రతిపక్షం కావాలి'' అని ముఖ్యమంత్రి అన్నారు.

వివిధ సందర్భాల్లో, ఒవైసీ అనేక సమస్యలపై, ముఖ్యంగా ముస్లిం సమాజానికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసేవారు. దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలను సమష్టిగా ఎదుర్కోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో అన్నారు. మహ్మద్ ప్రవక్త, గీత, బైబిల్ బోధనల సారాంశం దేశంలో, ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమేనని, 'విషం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని అరికట్టడానికి మనమందరం కలిసి నిలబడాలి' అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

"భారతదేశం మన దేశం, దానిని కాపాడుకోవడం మన బాధ్యత, దేశాన్ని రక్షించడానికి మరెవరూ రారు, ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించడంలో తప్పు లేదు, కానీ గెలవడానికి విషం వ్యాప్తి చేసే వ్యక్తుల నుండి మనం కాపాడుకోవాలి" అని ఆయన అన్నారు. లోక్‌సభలో ప్రజల కోసం మాట్లాడే వారి సంఖ్య తగ్గిందని, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు పెరిగిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు.

Next Story