రైతుభరోసా నిధులు రిలీజ్ చేసిన సీఎం రేవంత్..రేపటి నుంచి ఖాతాల్లో జమ

సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు అందించారు.

By -  Knakam Karthik
Published on : 22 March 2026 5:25 PM IST

Telangana, Cm Revanthreddy, Raithu Bharosa Funds, Congress Govt, Farmers

రైతుభరోసా నిధులు రిలీజ్ చేసిన సీఎం రేవంత్..రేపటి నుంచి ఖాతాల్లో జమ

సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు అందించారు. రైతు భరోసా పథకంలో భాగంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,600 కోట్ల నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. నేడు (ఆదివారం) బ్యాంకులకు సెలవు కావడంతో, ఈ నిధులు రేపటి (సోమవారం) నుండి రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కేవలం 45 రోజుల వ్యవధిలోనే మూడు విడతలుగా మొత్తం ₹9,000 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూడకుండా, సకాలంలో నిధులు అందజేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Next Story