చిన్నారుల కోసం 'తొలిముద్ద'..బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణలోని చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రమాణాలను పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఒక కీలక ముందడుగు వేశారు.

By -  Knakam Karthik
Published on : 28 March 2026 6:42 PM IST

Telangana, CM RevanthReddy, TholiMudda, Telangana Govt, Child Nutrition, Anganwadi, Breakfast Scheme

చిన్నారుల కోసం 'తొలిముద్ద'..బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణలోని చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రమాణాలను పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఒక కీలక ముందడుగు వేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన 'తొలిముద్ద' అనే అల్పాహార పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఆహార భద్రత అందుబాటులో ఉన్నప్పటికీ, పెరుగుతున్న పిల్లలకు అవసరమైన సరైన పోషకాహారం అందకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఈ సరికొత్త పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఉప్మా, ఖిచిడీ మిక్స్ వంటి పోషకాలతో కూడిన, సులభంగా వండగలిగే ఆహార పదార్థాలను ప్రభుత్వం అందించనుంది. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల వారు తీసుకునే ప్రాథమిక ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలను సొంత భవనాల్లోకి మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సమాజంలో నెలకొన్న అనేక ఆరోగ్య సమస్యలకు సమతుల్య పోషకాహార లోపమే ప్రధాన కారణమని, దానిని అధిగమించేందుకే 'తొలిముద్ద' వంటి కార్యక్రమాలను రూపొందించామని ఆయన వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది చిన్నారులకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story