ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై వీడిన సస్పెన్స్.. సీఎం కీలక నిర్ణయం

ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

By Knakam Karthik
Published on : 12 Jun 2025 7:48 AM IST

ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై వీడిన సస్పెన్స్.. సీఎం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. గడ్డం వివేక్: కార్మిక, మైనింగ్, అడ్లూరి లక్ష్మణ్ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖలు, వాకిటి శ్రీహరి: క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థకశాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ తాజా విస్తరణతో తెలంగాణ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలలో ఎలాంటి మార్పులు చేయకుండా, ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖలనే కొత్తగా నియమితులైన మంత్రులకు కేటాయించడం గమనార్హం. ఈ నెల 8న ముగ్గురు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.

Next Story