ప్లీన‌రీ వేదిక‌గా టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డి పేరు ప్ర‌క‌ట‌న‌

CM KCR Elected AS TRS Party President. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అధ్య‌క్షు‌డిగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు

By Medi Samrat  Published on  25 Oct 2021 6:51 AM GMT
ప్లీన‌రీ వేదిక‌గా టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డి పేరు ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అధ్య‌క్షు‌డిగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌ అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. పార్టీ‌లోని అన్ని విభా‌గాలు పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ మొత్తం 18 సెట్ల నామి‌నే‌షన్లు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. అధ్యక్ష పద‌వికి ఇత‌రు‌లె‌వ్వరూ నామి‌నే‌షన్లు దాఖ‌లు చేయ‌లేదు. దీంతో అధ్యక్షుడిగా కేసీ‌ఆర్‌ ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

ఇదిలావుంటే.. టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ ఇప్ప‌టి‌వ‌రకు వరు‌సగా ఎని‌మి‌ది‌సార్లు ఏక‌గ్రీ‌వంగా ఎన్ని‌క‌య్యారు. పార్టీ ఆవి‌ర్భావం తర్వాత ఇది 9వ సంస్థా‌గత ఎన్నిక.. ఈ ఎన్నిక‌లోనూ కేసీఆర్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. చివ‌ర‌గాగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరి‌గింది. 2019లో పార్ల‌మెంట్‌ ఎన్ని‌కలు, 2020, 2021లో కరోనా కార‌ణంగా పార్టీ ప్లీనరీ నిర్వ‌హిం‌చ‌లేదు. ఈ నేప‌థ్యంలో నేడు ప్రారంభ‌మైన ప్లీన‌రీ వేదిక‌గా పార్టీ అధ్య‌క్షు‌డి ఎన్నికపై ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.


Next Story