యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

By Knakam Karthik
Published on : 9 July 2025 7:24 AM IST

Telangana, Cm Revanthreddy, Union Minister Nadda, Farmers, Urea

యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయ‌న అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి మంగ‌ళ‌వారం క‌లిశారు. వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెల‌ల మ‌ధ్య 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం.. సాగు ప‌నులు జోరుగా సాగుతున్నందున‌ యూరియా స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని కోరారు. జులై నెలకు సంబంధించి 63 వేల మెట్రిక్ ట‌న్నులు దేశీయంగా ఉత్ప‌త్తి అయిన యూరియా, 97 వేల మెట్రిక్ ట‌న్నుల విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న యూరియా రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 29 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా మాత్ర‌మే చేశార‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. దేశీయంగా ఉత్ప‌త్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణ‌కు పెంచాల‌ని సీఎం కోరారు. యూరియా స‌ర‌ఫ‌రాకు సంబంధించి రైల్వే శాఖ త‌గిన రేక్‌లు కేటాయించ‌డం లేద‌ని, వాటి సంఖ్య పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Next Story