అప్పుడే ధరల పెరుగుదల అదుపులో ఉంటుంది : హరీశ్‌రావు

‘Centre humiliated Telangana and its people’. యాసంగి వ‌రిసాగును కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన మంత్రుల బృందం

By Medi Samrat  Published on  27 March 2022 2:15 PM GMT
అప్పుడే ధరల పెరుగుదల అదుపులో ఉంటుంది : హరీశ్‌రావు

యాసంగి వ‌రిసాగును కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన మంత్రుల బృందం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ను కలిసిన సమయంలో తెలంగాణను, తెలంగాణ ప్రజలను అవమానించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించగానే ఇంధనం, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అదుపులో ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

"ప్రభుత్వ రంగంలోని పోస్టులను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో బిజెపి విఫలమైంది" అని ఆయన అన్నారు, తెలంగాణ ప్రభుత్వం 1.30 లక్షల ఖాళీలను భర్తీ చేసిందని.. మరో 91,000 ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రారంభించిందని ఆయన అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల పోస్టులను భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. అంత‌కుముందు శ్రీగిరిపల్లి కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంత్రి పూజలు చేశారు.










Next Story