తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ఆమోదం

Centre gives nod for RRR in Hyderabad. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో

By Medi Samrat  Published on  13 Feb 2021 1:09 PM GMT
తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ఆమోదం

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు లోక్‌సభాపక్షనేత నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు బడుగుల లింగయ్య, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు కలిసిశుక్రవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గట్కారీ నిలిశారు. ఈ మేరకు రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర సర్కార్‌ ఆమోదం తెలిపినట్లు నితిన్‌ గట్కారీ తెలిపినట్లు నామ నాగేశ్వరరావు వెల్లడించారు. అలాగే పెండింగ్‌ ప్రాజెక్టుల అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.

ఇక హైదరాబాద్‌ చుట్టూ 254 కిలోమీటర్ల పొడవున ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రతిపాదించిన విషయాన్ని నామ నాగేశ్వర్‌ కేంద్రమంత్రికి వివరించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలుమార్లు కేంద్రానికి లేఖ కూడా రాశారని ఆయన గుర్తు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుందని, అలాగే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేసీఆర్‌ ఆలోచనతో ఆర్‌ఆర్‌ఆర్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. 2017లో సంగారెడ్డి నుంచి తుప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు మొదటి దశలో నిర్మించే జాతీయ రహదారికి ఎన్‌హెచ్‌ 161 ఏఏ గా నెంబర్‌ కేటాయించారని చెప్పారు. అయితే దీనిని 166 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని నామా నాగేశ్వరరావు వెల్లడించారు.

రెండో దశలో..

కాగా, రహదారుల నిర్మాణంలో భాగంగా రెండో దశలో చౌటుప్పల్‌-షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు నిర్మించే 182 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టును జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖకు నివేదికలు సమర్పించామని నామా అన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు నామా నాగేశ్వరరావు మంత్రికి వివరించారు. నాగపూర్‌-హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌, పుణె-హైదరాబాద్‌-విజయవాడ కారిడార్‌లో జాతీయ రహదారి కనెక్టివిటీ ప్రాముఖ్యత పెరుగుతుందని అన్నారు.




Next Story