తెలంగాణకు కేంద్రం శుభవార్త..పీఎంఏవై(యూ) 2.0 కింద 18,213 ఇళ్లు మంజూరు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది

By -  Knakam Karthik
Published on : 10 March 2026 8:40 PM IST

Telangana, PMAY Urban 2.0, Indiramma Indlu, Central Govt, Housing Scheme, TG Housing Corporation

తెలంగాణకు కేంద్రం శుభవార్త..పీఎంఏవై(యూ) 2.0 కింద 18,213 ఇళ్లు మంజూరు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 910.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో కేంద్రం తన వాటాగా రూ. 273.20 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 637.45 కోట్లు భరించనుంది.

న్యూఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (CSMC) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు అర్హులైన లబ్ధిదారులకు గృహ వసతి కల్పించడానికి ఎంతో దోహదపడుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ తెలిపారు.

Next Story