మంత్రి పొంగులేటిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..కారణమిదే!

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది.

By -  Knakam Karthik
Published on : 30 March 2026 8:10 PM IST

Telangana, Hyderabad, Telangana Politics, KTR, Minister Ponguleti, Governor Meet, MiningScam

మంత్రి పొంగులేటిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..కారణమిదే!

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి, మంత్రిని తక్షణమే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వినతి పత్రం సమర్పించింది. మంత్రికి సంబంధమున్న 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' సంస్థ జంట జలాశయాల పరిరక్షణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తితే ప్రభుత్వం స్పందించకుండా తమ సభ్యులను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏజెన్సీలపై తమకు నమ్మకం లేదని, పొంగులేటి పదవిలో ఉంటే విచారణను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. అవినీతిపై యుద్ధం ప్రకటిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు తన మంత్రిపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పొంగులేటి వ్యవహారంతో పాటు అమృత్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

Next Story