గాంధీభవన్‌కు పోటెత్తకముందే కళ్లు తెరవండి, హామీలపై తిరుగుబాటు తప్పదు: హరీష్ రావు

ప్రజలను నమ్మించడం, నయ వంచన చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్..అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు విమర్శించారు.

By Knakam Karthik
Published on : 23 Jun 2025 11:06 AM IST

Telangana, Brs Mla Harishrao, Congress Government, Cm Revanthreddy

గాంధీభవన్‌కు పోటెత్తకముందే కళ్లు తెరవండి, హామీలపై తిరుగుబాటు తప్పదు: హరీష్ రావు

ప్రజలను నమ్మించడం, నయ వంచన చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్..అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలు బంద్ చేస్తున్నారు. సన్నాలకు బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్యాస్ బండకు రాయితీ, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయి. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు..అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ ప్రస్తుతం గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డిడి పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. రేవంత్ రెడ్డి మాటలు విని విని విసిగి పోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్‌ కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియచేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తకముందే కళ్లు తెరవాలని, చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు..అని హరీష్‌ రావు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Next Story