బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల పాఠశాలలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని హరీష్ రావు విమర్శించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను, ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాలకు అద్దె బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ , ఆహారం, యూనిఫాంలు సహా అవసరమైన సామాగ్రి చెల్లింపులు జరగకపోవడంతో నిలిచిపోయాయని అన్నారు.
జూలై 1 నుండి, బకాయిలు చెల్లించకపోతే అన్ని ఆహార సరఫరాలను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు ఇప్పటికే హెచ్చరించారు.. అని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత కారణంగా లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఆరోగ్యం, విద్య ముప్పులో పడ్డాయి. గత 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించలేదు. కొన్ని సందర్భాల్లో, భవన యజమానులు పాఠశాలలకు తాళాలు వేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా, విద్యార్థులకు ఇంకా యూనిఫాంలు, బూట్లు లేదా స్కూల్ బ్యాగులు అందలేదు, దీనివల్ల వారు చిరిగిన యూనిఫాంలు ధరించాల్సి వస్తుంది" అని ప్రశ్నించారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీవ్ర వైఫల్యమని అభివర్ణించిన హరీష్ రావు, నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.