రేపు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న బీఆర్ఎస్ నేత‌లు

సింగరేణి కుంభకోణం అంశంపై బీఆర్ఎస్‌ నాయకులు మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనున్నారు.

By -  Medi Samrat
Published on : 26 Jan 2026 4:54 PM IST

రేపు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న బీఆర్ఎస్ నేత‌లు

రేపు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న బీఆర్ఎస్ నేత‌లు

సింగరేణి కుంభకోణం అంశంపై బీఆర్ఎస్‌ నాయకులు మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనున్నారు. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్ర ఉంద‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ అంశంపై కేటీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ బృందం రేపు గవర్నర్‌ను క‌లిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. కేటీఆర్ వెంట సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేత‌లు రాజ్ భవన్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు.

Next Story