సాయంత్రం వరకు లేపేస్తాం..తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్

తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ కలకలం రేపింది.

By Knakam Karthik
Published on : 23 Jun 2025 3:18 PM IST

Telangana, Bjp Mp Rahunadanrao, Threat Call, Maoists, Telangana DGP

సాయంత్రం వరకు లేపేస్తాం..తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్

తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ కలకలం రేపింది. సాయంత్రంలోగా మర్డర్ చేస్తామని హెచ్చరించడం తీవ్ర సంచలనం సృష్టించింది...వివరాల్లోకి వెళ్తే..మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు సోమవారం బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, ఆయన్ను అదే రోజు సాయంత్రంలోగా లేపేస్తాం.అని హెచ్చరించాడు.ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేశారు.

కాగా ఎంపీ రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, మావోయిస్టునని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రఘునందన్ రావును సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడు.

Next Story