కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై ఫైర్ అయిన రాజా సింగ్

లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కొరియోగ్రాఫర్ జానీ బాషా మాస్టర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీని కోరారు

By Medi Samrat  Published on  19 Sep 2024 8:52 AM GMT
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై ఫైర్ అయిన రాజా సింగ్

లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కొరియోగ్రాఫర్ జానీ బాషా మాస్టర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీని కోరారు. అసలు నిజం బయటకు రావాలంటే పోలీసులు ఇలాంటి వారికి సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలో, కొరియోగ్రాఫర్‌పై వివరణాత్మక విచారణ జరిపి, అతని అకృత్యాలను, అమాయక మహిళలను ఎలా వేధించాడో బహిర్గతం చేయాలని పోలీసులను కోరారు. జానీ మాస్టర్ 'లవ్ జిహాద్'లో భాగమని రాజా సింగ్ ఆరోపించారు. జానీ మాస్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు పోలీసుల వైపు చూస్తున్నారని రాజా సింగ్ అన్నారు. పోలీసు అధికారులు జానీ మాస్టర్ గత చరిత్ర, అతను ఎంత మంది మహిళలను మతం మార్చడానికి ప్రయత్నించాడనే దానిపై కూడా దృష్టి పెట్టాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.

జానీ మాస్టర్‌ అలియాస్ షేక్‌ జానీ భాషాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీస్‌ టీమ్‌ గోవాలోని ఓ లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరు పరిచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచే అవకాశం ఉంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైంది. జానీ అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story