కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేత పులిమామిడి రాజు ఆ పార్టీని వీడి శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సమక్షంలో

By Medi Samrat  Published on  13 April 2024 12:30 PM GMT
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేత పులిమామిడి రాజు ఆ పార్టీని వీడి శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మెదక్‌ ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ మెదక్‌ అభ్యర్థి నీలం మధు, ఇతర నేతలు ఆయన వెంట ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. ముదిరాజ్ మహా సభ మెదక్ జిల్లా విభాగం అధ్యక్షుడైన రాజుకు అసెంబ్లీ ఎన్నికల్లో 20,921 ఓట్లు వచ్చాయి. ఇంతకు ముందు ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్నాడు.

సీఎం రేవంత్ రెడ్డి పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారికి స్వాగతం చెబుతుందన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పులి మామిడి రాజును సీఎం అభినందించారు.

Next Story