తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

By Medi Samrat
Published on : 10 Jan 2025 11:40 AM

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పులి సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య (పెద్ద‌ప‌ల్లి) కరీంనగర్- నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ప్రకటించారు.

Next Story