సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన‌ తేజస్వి యాదవ్‌

Bihar Leader of Opposition Tejaswi Yadav meets CM KCR. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు

By Medi Samrat  Published on  11 Jan 2022 1:22 PM GMT
సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన‌ తేజస్వి యాదవ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, థర్డ్‌ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో తేజస్వి మంతనాలు సాగించారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తేజస్వి యాదవ్‌ బృందంలో సమాజ్ వాదీ పార్టీ నేతలు అబ్దుల్ సిద్దిఖీ, సునీల్ సింగ్ ఉన్నారు. ప్రస్తుతం బిహార్ విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు.

జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యూహాలపై చర్చించేందుకు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం కేసీఆర్ ను కలిసింది. ఈ సమావేశానికి తీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు హాజరు కాగా, బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ సభ్యుడు అబ్దుల్ భారీ సిద్ధిఖీ, ఎమ్మెల్యే సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ కూడా పాల్గొన్నారు.

జనవరి 8వ తేదీ శనివారం నాడు ప్రగతి భవన్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సిపిఎం నాయకులకు తెలంగాణ సిఎం ఆతిథ్యం ఇచ్చారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్, కేరళ ఎంపీ బినయ్ విశ్వం తదితర నేతలు జాతీయ రాజకీయ పరిస్థితులతోపాటు పలు అంశాలపై సీఎంతో చర్చించినట్లు ముఖ్యమంత్రుల అధికారి (సీఎంవో) ఒక ప్రకటనలో తెలిపారు.


Next Story