కేటీఆర్, కవితలపై సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్

Bandi Sanjay made sensational allegations against KTR and Kavita. ప్రజా సంగ్రామ యాత్రలోభాగంగా నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ చీఫ్

By Medi Samrat  Published on  6 Dec 2022 12:45 PM GMT
కేటీఆర్, కవితలపై సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రలోభాగంగా నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ డ్రగ్స్ కు బానిస అయ్యాడని అతని వెంట్రుకలు, రక్త నమూనా ఇస్తే నిరూపిస్తామని బండి సంజయ్ సవాల్ విసిరారు.

లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిలో తండ్రికి తగ్గ కూతురుగా కవిత గుర్తింపు పొందారని.. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వారం రోజుల పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తాను ఎంపీ అయ్యానని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాకే పేదోళ్లకు న్యాయం జరుగుతోందని, 12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్రమంత్రులు చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.


Next Story