గత 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఏడుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించింది. మహబూబాబాద్ పోలీసు సూపరింటెండెంట్ కథనం ప్రకారం.. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని ఓ గ్రామంలో ఓ విద్యార్థిని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోగా.. మరొకరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
అదే విధంగా హైదరాబాద్.. సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పరీక్షలలో పెయిల్ అవడం భరించలేక తన జీవితాన్ని ముగించుకున్నాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్ జోన్) ఆర్ గిరిధర్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని నల్లకుంట ప్రాంతానికి చెందిన మరో బాలుడు జడ్చర్ల వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో శవమై కనిపించాడు. పరీక్షల్లో పేయిల్ అవడమే అతడి మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ముగ్గురు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు నివేదికలు అందాయని తెలిపారు.