ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా మ‌ర‌ణాలు

17188 New Corona Cases In AP. ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,00,424 క‌రోనా

By Medi Samrat  Published on  7 May 2021 1:50 PM GMT
ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,00,424 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 17,188 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 12,45,374కి చేరింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా చిత్తూరులో 2,260 మంది, ప్ర‌కాశంలో అత్య‌ల్పంగా 385 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

కోవిడ్ వల్ల విజయనగరంలో పదకొండు మంది, విశాఖపట్నంలో పది మంది, తూర్పు గోదావరిలో ఎనిమిది, చిత్తూర్ లో ఏడుగురు, కృష్ణలో ఆరుగురు, గుంటూరు లో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, పశ్చి మ గోదావరిలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్ లో ఇద్దరు చొప్పున మొత్తం 73 మంది క‌రోనా కార‌ణంగా మరణించారు. దీంతో మ‌హ‌మ్మారి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 8,519కి చేరింది. నిన్న 12,749 మంది కోలుకోగా.. మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 10,50,160కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,86,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 1,71,60,870 సాంఫిల్స్‌ను ప‌రిక్షించారు.




Next Story