ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

1578 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గాయి.

By Medi Samrat  Published on  12 July 2021 1:17 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 62,657 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 1,578 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,24,421కి చేరింది. నిన్న 3,041 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,84,202కి పెరిగింది.

కోవిడ్ వల్ల తూర్పు గోదావరిలో ముగ్గురురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరు ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్ద‌రు, క‌ర్నూలులో ఒక్క‌రు, విశాఖపట్నంలలో ఒక్కరు చొప్పున మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,024కి చేరింది. ఇక రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,30,48,945 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story