ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. 24 గంట‌ల్లో 12 మంది మృతి

12561 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా

By Medi Samrat  Published on  28 Jan 2022 11:59 AM GMT
ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. 24 గంట‌ల్లో 12 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ 12 వేలకుపైగా నమోదయ్యాయి. కేసులు పెర‌గుతుండటంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,635 పరీక్షలు నిర్వహించగా.. 12,561 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,48,608కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ప‌న్నెండు మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలు మరియు నెల్లూరు లలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం మరియు పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,591గా ఉంది. 24 గంటల వ్యవధిలో 8,742 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,20,717 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,23,65,775 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story