హైదరాబాద్ : డా.లక్ష్మణ్ స్వల్ప అస్వస్థతతో నిమ్స్లో చేరారు. బస్సు భవన్ దగ్గర లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం నుంచి ఆయన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్సు భవన్ దగ్గర కూర్చున్నారు. అక్కడ జరిగిన తోపులాటలో లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు . డా.లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి నారాయణగూడ పీఎస్కు తరలించినట్లు తెలుస్తోంది.