సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక.. టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 Jun 2020 12:30 PM IST

సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక.. టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతితో దేశమంతా షాక్‌కు గురైంది. సుశాంత్‌ మరణించి రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారు. సుశాంత్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని బాలీవుడ్‌ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తన అభిమాన నటుడి మరణవార్త విని తట్టుకోలేక ఓ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటు చేసుకుంది. బరేలికి చెందిన పదో తరగతి విద్యార్థికి సుశాంత్‌ అంటే ఇష్టం. అతడికి వీరాభిమాని. అతడి సినిమాలు అంటే ఎంతో ఇష్టపడేవాడు. సుశాంత్‌ మృతిచెందడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. తన హీరోలేని జీవితం తనకు వద్దని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ లేఖలో " నా హీరో ఆత్మహత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా " అంటూ రాసి ఉంది.

సుశాంత్ మృతి చెందిన మూడు రోజులకే ఆయన ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆయన వదిన అనారోగ్యానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే.

Next Story