క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ, మార్చి 20, గురువారం, ముంబైలోని బాంద్రాలోని ఒక కుటుంబ కోర్టుకు విడాకుల పిటిషన్ విచారణకు వచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి రెండు రోజుల ముందు, లెగ్ స్పిన్నర్ మాస్క్ ధరించి కోర్టు ఆవరణలోకి ప్రవేశించాడు. చాహల్, ధనశ్రీ ఇద్దరూ త్వరగా లోపలికి వెళ్లిపోయారు. మీడియా కంటబడకుండా వారు వేగంగా వెళ్లిపోయారు.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న చాహల్. మార్చి 20 నాటికి కేసును వేగవంతం చేసి తీర్పు ఇవ్వాలని బుధవారం బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. దీంతో చాహల్ గురువారం మధ్యాహ్నం ముంబైకి చేరుకుని కోర్టులో హాజరయ్యాడు. చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ జట్టుతో శిక్షణ పొందుతూ ఉన్న చాహల్ విచారణకు హాజరయ్యేందుకు విరామం తీసుకున్నాడు. ఈ దంపతులకు 2020లో పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇక ధనశ్రీకి చాహల్ రూ. 4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం.