2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్లలో సభ్యుడైన లెగ్-స్పిన్నర్ పియూష్ చావ్లా, అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. చావ్లా మూడు టెస్టులు, 7 T20Iలు, 25 ODIలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు, మూడు ఫార్మాట్లలో 43 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 192 మ్యాచ్లలో 192 వికెట్లు తీశాడు చావ్లా. లెగ్-స్పిన్నర్ IPL 2024లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్లో కంటే దేశవాళీలు, ఫ్రాంఛైజీ క్రికెట్లో పీయూష్ చావ్లా సత్తా చాటాడు. ఇప్పటివరకు 446 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 319 టీ20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దేశవాళీల్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాడు. చావ్లా తన 15వ ఏట పోటీ క్రికెట్ అరంగేట్రం చేసాడు. భారత అండర్-19, ఉత్తరప్రదేశ్ అండర్-22 జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
2005-06 ఛాలెంజర్ సిరీస్లో సచిన్ టెండూల్కర్ను గూగ్లీతో అవుట్ చేసినప్పుడు అతను వెలుగులోకి వచ్చాడు. 17వ ఏటనే తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.