అచ్చం ధావ‌న్‌లాగే ఉన్న వ్య‌క్తిని చూసి న‌వ్వు ఆపుకోలేక‌పోయిన విరాట్ కోహ్లీ..!

సోమవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ రూపాన్ని పోలిన వ్య‌క్తిని చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్

By Medi Samrat  Published on  26 March 2024 11:50 AM GMT
అచ్చం ధావ‌న్‌లాగే ఉన్న వ్య‌క్తిని చూసి న‌వ్వు ఆపుకోలేక‌పోయిన విరాట్ కోహ్లీ..!

సోమవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ రూపాన్ని పోలిన వ్య‌క్తిని చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్ అయ్యింది. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కెమెరామెన్ శిఖర్ ధావన్ లాగా ఉన్న వ్యక్తిపై అంద‌రి దృష్టి మ‌ళ్లింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా శిఖర్ ధావన్‌లా కనిపించే తన హెయిర్‌స్టైల్‌ని పెద్ద స్క్రీన్‌పై చూపించాడు అభిమాని. ఆ తర్వాత బౌండరీ లైన్‌పై నిలబడిన విరాట్ కోహ్లీకి కెమెరా వెళ్లింది. పెద్ద స్క్రీన్‌పై శిఖర్ ధావన్ లాంటి లుక్ ఉన్న వ్య‌క్తిని చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. విరాట్ కోహ్లి తన భావాలను వెంట‌నే వ్య‌క్తప‌రుస్తాడు. ఇక్కడ కూడా కోహ్లీ ధావన్ రూపాన్ని చూసి సంతోషంగా ఉన్నాడని తన ముఖ కవళికల ద్వారా చూపించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో, ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలావుంటే.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. సోమవారం తొలుత బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో పంజాబ్‌ ఐదో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లలో RCBకి ఇది మొదటి విజయం. IPL 2024 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆరో స్థానంలో నిలిచింది.

Next Story