చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ రద్దు

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ ను రద్దు చేశారు.

By -  Medi Samrat
Published on : 23 Dec 2025 8:58 PM IST

చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ రద్దు

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ ను రద్దు చేశారు. భద్రతాపరమైన లోపాలు ఉన్నాయన్న కారణంతో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 24న జరగాల్సిన మ్యాచ్‌కు అనుమతిని నిరాకరిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. హోం శాఖ ఆదేశాల మేరకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ), అగ్నిమాపక, విద్యుత్, పీడబ్ల్యూడీ, పోలీసు శాఖల అధికారులతో కూడిన కమిటీ సోమవారం స్టేడియాన్ని తనిఖీ చేసిందని తెలిపారు. కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, బుధవారం నాటి మ్యాచ్‌కు అనుమతి నిరాకరించామని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించుకుంటామని కేఎస్‌సీఏ విజ్ఞప్తి చేసినప్పటికీ, అధికారులు అంగీకరించలేదు.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆడతాడన్న ప్రచారం ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ ఏడాది జూన్‌లో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. స్టేడియం గేట్లు ఇరుకుగా ఉండటం, అత్యవసర ఏర్పాట్లలో లోపాలు ఉండటంతో మ్యాచ్ కు అనుకూలం కాదని అధికారులు నిర్ణయించారు.

Next Story