'నాకు తెలుసు'.. కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై గంగూలీ వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
By Medi Samrat
విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. రిటైర్మెంట్ నిర్ణయం కోహ్లీ వ్యక్తిగతమని గంగూలీ ధృవీకరించాడు. మే 12న కోహ్లి టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి నాలుగు రోజుల ముందే బీసీసీఐకి తెలిపాడు. కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయంపై యూ-టర్న్ తీసుకునేలా బోర్డు ప్రయత్నించింది.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ కోహ్లీతో కలిసి పనిచేశాడు. భారత మాజీ కెప్టెన్ కోహ్లీ స్వతంత్రంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని.. బయటి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని గంగూలీ ఉద్ఘాటించాడు.
కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్లో కూడా పాల్గొన్నాడు. అప్పటి వరకు కోహ్లి ఇంగ్లండ్ టూర్కు వెళతాడని అంతా భావించగా.. ఒక్కసారిగా పరిస్థితి తారుమారయ్యి మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
గంగూలీ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా అసంబద్ధం అని నేను చెబుతాను. ఆటగాడిగా తను అర్థం చేసుకున్నాడు. ఆటగాడిగా అతను ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. టెస్టు క్రికెట్లో అతని ప్రదర్శన గత ఐదేళ్లలో బాగా లేదని నాకు తెలుసు, కానీ అతనిలాంటి ఛాంపియన్లు తమను తాము నిరూపించుకున్నారు. ఒకవేళ అతను ఇంగ్లండ్ టూర్కు వెళ్లి ఉంటే కచ్చితంగా పరుగులు చేసి ఉండేవాడని నేను హామీ ఇస్తున్నాను. కానీ రిటైర్మెంట్ సమయం వచ్చిందని అతను గ్రహించాడు. ప్రతిదానికీ ముగింపు ఉంటుంది. కోహ్లి రిటైర్మెంట్ చూసి మనలో చాలా మంది ఆశ్చర్యపోయారు. అతడి వయసు 36 ఏళ్లు మాత్రమే. అతను ఫిట్గా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్, వన్డే క్రికెట్లు ఆడుతున్నాడు. కానీ, ఏదో ఒకరోజు ఆట నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. తను బయలుదేరే సమయం ఆసన్నమైందని భావించి, తను నిర్ణయం తీసుకున్నాడని వ్యాఖ్యానించాడు.
సౌరవ్ గంగూలీ 37 సంవత్సరాల వయస్సులో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అతను ఏడాదికి పైగా వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. T20 జట్టులో కూడా స్థానం లేదు. 2006-07లో గంగూలీ ఇతర భారత బ్యాట్స్మెన్ కంటే ఎక్కువ ODI పరుగులు చేశాడు. అయినప్పటికీ జట్టు యువతపై దృష్టి పెట్టడంతో అతను రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు